21 May, 2026 | 3:01 AM

ఇటలీ-ఇండియా బంధం బలోపేతం

21-05-2026 01:44 AM

ద్వైపాక్షిక బలోపేతం

  1. ఇండియా-ఇటలీ మధ్య చారిత్రక ఒప్పందాలు
  2. ఐదేళ్ల పాటు పరస్పర సహాయ సహకారాలు
  3. వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్ష రంగాల్లో సరికొత్త సహకారం
  4. రోమ్ చర్చల్లో ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోని

రోమ్, మే 20: రోమ్ నగరం సాక్షిగా భార త్, ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల బంధాన్ని ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) కుదరిందని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య చారిత్రక ఒప్పందాలు జరిగాయి. దీంతో వాణిజ్యం, పెట్టుబడులు, అంత రిక్షం, రక్షణ, ఏఐ, నౌకాయానం రంగాల్లో ఐదేళ్లపాటు పరస్పర సహాయ సహకారాలు చేసు కోనున్నాయి.

ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను, ఒప్పందాలను భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వివరించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ చేరుకున్న ప్రధాని నరేం ద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం ఘనంగా సైనిక వందనంతో స్వాగతం పలికింది. ఆ తర్వాత విల్లా పాంఫిలిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాలధినేతలు బుధవారం మీడియాతో మాట్లాడారు. 

‘భారత్, ఇటలీల మధ్య సంబంధం ఇప్పు డు ఒక కీలక దశకు చేరుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో, ఇరుదేశాల మధ్య ఒప్పందాలు అపూర్వమైన వేగంతో విస్తరిస్తున్నాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దార్శనికత ఆధారంగా, ఒక సౌహార్దపూర్వక స్నేహం నుంచి ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిణామం చెందాయి’ అని అన్నారు.

‘పారిశ్రామిక శక్తిగా ఇటలీ స్థానాన్ని ప్రతిబింబించే ఇటాలియన్ డిజైన్, తయారీ నైపుణ్యం, ప్రపంచ స్థాయి సూపర్ కంప్యూటర్లు, అలాగే 100కు పైగా యూనికార్లను, 2 లక్షల స్టార్టప్లతో కూడిన భారతదేశపు వేగవంతమైన ఆర్థికవృద్ధి, ఇంజనీరింగ్ ప్రతిభ, విస్తృ తి, ఆవిష్కరణలు, వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ మధ్య ఒక శక్తివంతమైన సమన్వయా న్ని ఏర్పరచడమే మా లక్ష్యం’ అని అన్నారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరువైపులా వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుందన్నారు.

‘రక్షణ, ఏరోస్పేస్, సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయనాలు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, వ్యవసాయ-ం, ఆహారం, పర్యాటకం, మరిన్ని రంగాలపై దృష్టి సారించి, 2029 నాటికి ఇటలీ, -భారతదేశం మధ్య వాణిజ్యం కోసం నిర్దేశించిన 20 బిలియన్ యూరోల లక్ష్యాన్ని చేరుకోవాలని, అధిగమించాలని ఒప్పందం కుదిరింది’ అని తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇటలీ’ ఎల్లప్పుడూ శ్రేష్ఠతకు పర్యాయపదంగా ఉందని, నేడు ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఉన్నత-నాణ్యత లక్ష్యాలతో సహజమైన సమన్వ యాన్ని కనుగొంటోంది’ అని మోదీ, మెలోనీ అన్నారు.

ఈ భాగస్వామ్యానికి సాంకేతిక ఆవిష్కరణలే మూలస్తంభమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, అధునాతన తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలి క సదుపాయాలు వంటి రంగాలలో పురోగతితో రాబోయే దశాబ్దాలు అపారమైన పరిధి గల సాంకేతిక విప్లవంతో రూపుదిద్దుకుంటాయని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో సమ్మిళిత అభివృద్ధికి ఏఐని ఒక శక్తివంతమైన సాధనంగా భారతదేశం, ఇటలీ చూస్తున్నాయని వారు తెలిపారు.

ఈ విశ్వసనీయ, సమా నత్వంతో కూడిన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయ న్నారు. ఏఐని మానవుల కోసం మానవులు సృష్టించిన సాధనంగా భావించడం అంటే, సాంకేతికత వ్యక్తులను భర్తీ చేయలేదని, వారి ప్రాథమిక హక్కులను దెబ్బతీయలేదని, అలా గే ప్రజా చర్చలను తారుమారు చేయడానికి లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలను మార్చడానికి ఉపయోగించలేమని చెప్పడమేనని తెలిపారు.

భారత్--ఇటలీ సహకారం అంతరిక్ష రంగాన్ని కూడా కవర్ చేస్తుందన్నారు. రక్షణ, భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇటలీ, భారతదేశం భావిస్తున్నా యని వారు తెలిపారు. ‘మా సహకారం కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించ డానికి, ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్వర్క్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబ ర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనే స్థైర్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది’ అని అన్నా రు. ఇంధనం మా భాగస్వామ్యానికి మరో కీలకమైన స్తంభం అని, వైవిధ్యభరితమైన ఇంధన వనరుల వైపు ప్రపంచ పరివర్తనకు ఆవిష్కరణ, పెట్టుబడి, సహకారం అవసరమన్నారు.

అంతా ‘మెలోడి’

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని మోదీ ఇచ్చిన ‘మెలోడి’ టాఫీ గిఫ్ట్, ఆమెతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జార్జియా మెలోనీ, ప్రధాని మోదీ ఫ్రెండ్షిప్‌నకు నెటిజన్లు ‘మెలోడీ’ అనే పేరును మూడేళ్ల క్రితమే ఖరారు చేశారు. ఇరు దేశాధినేతల సమావేశం జరిగిన ప్రతిసారీ ఈ హ్యాష్ ట్యాగ్ నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోంది. అయితే, తాజాగా ప్రధాని మోదీ స్వయంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను గుర్తుచేస్తూ ఇటలీ ప్రధానికి ఒక గిఫ్ట్ ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తమ ఫ్రెండ్షిప్‌నకు చిహ్నంగా ఉన్న మెలోడీ ప్యాకెట్‌ను పట్టుకుని ఇరు దేశాధినేతలు చిరునవ్వులు చిందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తుతోంది. అసలు వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఇంతగా బలపడటానికి కారణాలేంటి? మోదీతో మెలోనీకి ‘మెలోడీ’ ఎలా కుదిరిందనేది ఆసక్తికరంగా మారింది.

మోదీతో మెలోనీ ఇంత చనువుగా మెలగడానికి కారణం ఏంటని చాలా మంది ఆరా తీస్తున్నారు. మోదీ, మెలోనీ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకే కార్‌లో ప్రయాణించడం.. రోమ్‌లోని చారిత్రక కొలోజియం సందర్శన.. మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను ఇటలీ ప్రధానికి మోదీ బహుమతిగా ఇవ్వడం ఇవన్నీ.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోల పట్ల నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, తనకు ‘మెలడీ’ టోఫీలను బహుమతిగా ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రధాని మోదీ ఒక బహుమతిగా చాలాచాలా రుచికరమైన టోఫీని తీసుకొచ్చారు..-- అదే ‘మెలడీ’. ‘ఈ బహుమతికి ధన్యవాదాలు’ అని బుధవారం సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. గతంలో వీరిద్దరూ కలిసిన సమయంలో ‘మెలోడీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు వైరల్ అయ్యాయి.