21 May, 2026 | 1:29 PM

విజయ్ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో చేరిన కాంగ్రెస్

21-05-2026 12:40 PM

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి(Tamil Nadu Chief Ministerసి. జోసెఫ్ విజయ్(C. Joseph Vijay) తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. 23 మంది ఎమ్మెల్యేలతో లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్(Rajendra Vishwanath Arlekar) మంత్రులుగా ప్రమాణం చేశారు. టీవీకే(Tamilaga Vettri Kazhagam) నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను విజయ్ మంత్రివర్గంలో మంత్రులుగా చేర్చుకున్నారు.

మిత్రపక్షాలు ఐయూఎంల్, వీసీకేకు ప్రస్తుత మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. మంత్రి వర్గంలో మిగిలిన 3 పదవులను మిత్రపక్షాలకు అప్పగించే అవకాశముందని సమాచారం. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చోటు దక్కడంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీనాథ్, ఎస్. కమలి, సి. విజయలక్ష్మి, ఆర్. వి. రంజిత్‌కుమార్‌లతో సహా TVK ఎమ్మెల్యేలు(TVK MLAs) తొలుత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కిల్లియూర్‌కు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్. రాజేష్ కుమార్, మేలూరు నియోజకవర్గం నుండి గెలిచిన పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.