calender_icon.png 12 February, 2026 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల శిబిరం

12-02-2026 07:11:41 PM

చిట్యాల,(విజయక్రాంతి): ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని  ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో  కంటి పరీక్షల శిబిరం గురువారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో హాస్పిటల్ వాళ్లు పాల్గొని  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్  నర్రా సురేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎన్ యాదయ్య , ఉపాధ్యాయులు  ఎం. నీరజ, పి.చంద్రయ్య, ఎ.నరసింహ, అనిస్ఫాతిమా సుల్తానా, పెంటయ్య తదితరులు   పాల్గొన్నారు.