23 March, 2026 | 5:36 AM

సకాలంలో ఓ పాజిటివ్ రక్తం అందజేత

23-03-2026 12:42 AM

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి అర్బన్, మార్చి 22, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో సయ్యద్ అబ్దుల్ (30) రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఆలిండియా యూత్ ఫెడరేషన్, సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ ముదాం ప్రవీణ్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అబ్దుల్ కి శరీరంలో రక్తం మూడు శాతానికి పడిపోవడంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని అన్నారు,రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదానానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాత ముదాం ప్రవీణ్ కు అభినందనలు తెలియజేశారు.