16 August, 2026 | 2:23 PM

Districts - Kamareddy

article_42625904.webp
ఎమ్మెల్యే కూతురు వివాహ విందుకు హాజరైన సీఎం

కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు వివాహ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9.10 నిమిషాలకు వస్తారని భావించగా 12.10 గంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద డిబిఆర్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన వివాహ విందు కార్యక్రమానీ కి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎంతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, లు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దంపతులు సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు.

16-08-2026

article_54154889.webp
ఉత్తమ సేవా అవార్డు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్

బాన్సువాడ, ఆగస్టు 16 (విజయ క్రాంతి): 80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో శనివారం బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు వి హనుమంతరావు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. విధులలో నిబద్ధత అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ అవార్డు అందుకోవడంతో పట్టణ పోలీస్ సిబ్బంది తోటి మిత్రులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

16-08-2026

article_71713887.webp
రోడ్డున పడిన టీసీసీఓల ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా...?

బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో గత రెండు దశాబ్దాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించిన 632 మంది టైపిస్ట్-కం-కంప్యూటర్ ఆపరేటర్లు (టిసిసిఓలు) ప్రస్తుతం తీవ్ర ఆందోళన, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.దాదాపు 20 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవల్లో భాగమై పనిచేస్తూ రెవెన్యూ శాఖకు వెన్నెముకలా నిలిచిన వీరి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖల్లో టిసిసిఓలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

16-08-2026

article_15641146.webp
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

నాగిరెడ్డిపేట,ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన భామనీళ్ళ బక్కయ్య,బోరంచ నర్సయ్యులకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ యాద గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సంగయ్య ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.బామనీళ్ల నరసయ్య 1,75 వేల,,సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా, బోరంచ నర్సయ్యకు 39 వేలు,,చెక్కును మంజూరు కావడంతో వాటిని శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు,గ్రామ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద గౌడ్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సంగయ్య,ఉప సర్పంచ్ అభిషేక్,వార్డు మెంబర్లు, గ్రామస్తులు మధు,సిద్దు,శ్రీనివాస్ గౌడ్, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.

16-08-2026

article_29390701.webp
ఉత్తమ సేవలకు గుర్తింపు.. భూపాల్ సంతోష్ కుమార్‌కు ప్రశంసాపత్రం

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు. బీబీపేట మండలం యాడారం క్లస్టర్ వ్యవసాయ శాఖ ఏఈఓ భూపాల్ సంతోష్ కుమార్‌కు ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. రైతులకు వ్యవసాయ సలహాలు అందించడం, ప్రభుత్వ పథకాలను చేరువ చేయడం, శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఈ గుర్తింపు లభించింది.

16-08-2026

article_78765857.webp
నాగిరెడ్డిపేట్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 16(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు మండల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.నాగిరెడ్డిపేట్ మండలంలోని సర్పంచులు,మండల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.వివిధ శాఖల అధికారులు వారి కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.పంద్రాగస్టు వేడుక సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులు, కస్తూర్బా విద్యార్థులు,కేరళ స్కూల్ విద్యార్థులు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.

16-08-2026

article_84606916.webp
సీయుఈటీ పీజీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం చేసిన సర్పంచ్

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని మాసంపల్లి గ్రామానికి చెందిన గొర్రె చైతన్య కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టులో ఇటీవల ప్రతిభ కనపరిచింది.మాసానిపల్లి గ్రామానికి చెందిన గొర్రె చైతన్య ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు) పీజీ కోర్సులో ప్రవేశానికి సీటు సాధించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి పంద్రాగస్టు వేడుకలు సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకంగా కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ప్రవేశానికి సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మరిన్ని ఉన్నత విద్యలో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి,మాజీ సర్పంచులు అంజా గౌడ్, వరిగే విట్టల్,పంచాయతీ కార్యదర్శి సుభాష్ రెడ్డి,కారోబార్ నర్సింలు,వార్డుమెంబర్లు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు గంగయ్య, ఏసుదాసు,బాబాగౌడ్ సందీప్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

16-08-2026

article_72266897.webp
కామారెడ్డిలో చోరీ కేసు ను చేదించిన పోలీసులు

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): కామారెడ్డిలో ఇటీవల జరిగిన భారీ చోరీ చేసిన కామారెడ్డి పోలీసులు చేదించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారీ దొంగతనం కేసులో నిందితున్ని పట్టుకొని అరెస్టు చేసినట్లు వాటి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి విద్యుత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మామిండ్ల స్వప్న ఈనెల 7న ఇంటికి తాళం వేసి కామారెడ్డి లో ఉంటున్న తల్లిగారింటికి వెళ్ళింది. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోనే బీరువా లోని వస్తువులు చిందర వందర పడి ఉండడంతో దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

15-08-2026

article_83168652.webp
కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): కుల గణన తోనే బీసీలకు సమగ్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి ప్రత్యేక సలహాదారు వి హనుమంతరావు అన్నారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశ జనాభాలో బీసీల వాటా గణనీయంగా ఉన్నప్పటికీ, వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని వి. హనుమంతరావు అన్నారు. జనాభా ఎంత ఉంటే, ఆ మేరకు అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని స్పష్టం చేశారు.జనగణనతో పాటు సమగ్ర కులగణన నిర్వహించి, ప్రతి సామాజిక వర్గం జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలపై సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. కులగణన ఆధారంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

15-08-2026

article_70598205.webp
త్యాగాలతోనే స్వాతంత్య్రం

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): త్యాగాలతో స్వాతంత్ర్యం సిద్ధించిందని అమరుల త్యాగాల తోనే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వి హనుమంతరావు అన్నారు. శనివారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల తోనే జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి పేద వాడి జీవితంలో వెలుగులు నింపడమే నిజమైన స్వాతంత్రం అని అన్నారు.

15-08-2026

article_42184965.webp
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

దోమకొండ, ఆగస్టు 15 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో నిర్వహించిన కార్యక్రమానికి దోమకొండ మండలానికి చెందిన మహిళా లబ్ధిదారులు తరలివెళ్లారు. దోమకొండ మండలం నుంచి తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఎంఆర్‌ఐ అధికారులు, దోమకొండ హెడ్‌క్వార్టర్‌కు చెందిన ఇద్దరు జీపీ అధికారులు, రేషన్‌ డీలర్‌తో పాటు మహిళా లబ్ధిదారులు కామారెడ్డి కళాభారతికి చేరుకున్నారు. అధికారులు లబ్ధిదారులకు అవసరమైన సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్‌ సరుకులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

15-08-2026