05-02-2026 12:00:00 AM
మాగనూరు ఫిబ్రవరి 4. మాగనూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం సీఎం కప్పు 20 25 పోటీలను ఎమ్మార్వో సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అదేవిధంగా క్రీడల వల్ల శరీర దృఢత్వం ఏర్పడుతుందన్నారు. 15 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు కబడ్డీ ,కోకో ,వాలిబాల్ ,పోటీలను నిర్వహించడం జరిగిందని పిడి రాకేష్ శర్మ తెలిపారు.
ఈ యొక్క పోటీల్లో క్రీడా నై పుణ్యం కనపర్చిన విద్యార్థులను జిల్లా స్థా యిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జ రిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, సర్పంచ్ జనార్ధనమ్మ, మండ ల కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్ గౌడు, ఉప సర్పంచ్ పెద్దింటి రాజు, ప్రధానోపాధ్యాయు లు బాబుల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ గౌడ్, హోంగార్డు చిన్న లింగన్న, ఉపాధ్యా య బృందం వివిధ గ్రామాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,