పెద్దపల్లి నియోజకవర్గంలో కటింగ్ లు లేకుండా వడ్లు, మక్కలు కొనుగోలు
సుల్తానాబాద్, (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో మక్కలు , ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో మార్క్ ఫేడ్ , సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు, కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న విషయమై అప్పటికప్పుడు ఎమ్మెల్యే విజయరమణ రావు అధికారులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరించారు.
18-05-2026