జిల్లా ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా, జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను గైనకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ రాధిక, డాక్టర్ శశి జ్యోత్స్న కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రికి వచ్చిన వెంటనే అవసరమైన సూచనలు, పరీక్షలు, వైద్య సేవలపై పూర్తి సమాచారం అందించడమే ఈ హెల్ప్ డెస్క్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
03-04-2026