డీడీఎన్ అర్చకుల్లో చీలికలు తెచ్చే కుట్రలను తిప్పికొట్టాలి
మహబూబాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ధూప దీప నైవేద్య (డిడిఎన్) అర్చకుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర సంఘంపై కొందరు స్వార్థపరులు కులం రంగు పులిమి, అర్చక లోకంలో చీలికలు తేవాలని చూడటం అత్యంత విచారకరమని, ‘ఐకమత్యమే మహాబలం’అనే సత్యాన్ని విస్మరించి, వ్యక్తిగత అజెండాలతో సంఘాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న శక్తుల పట్ల అర్చక సమాజం అప్రమత్తంగా ఉండాలని డి డి ఎన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు లింగోదు వెంకటేశ్వర ఆచార్యులు పేర్కొన్నారు.
02-07-2026