ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
15-08-2026 12:09 PM
కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపాలిటీలో చైర్పర్సన్ బానోత్ సునీత,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్, పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ క్రాంతి కిరణ్, ధనసరి సొసైటీ కార్యాలయంలో చైర్మన్ మర్రి రంగారావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ హరీష్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వెంకన్న జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.






