పీరియాడిక్ కథతో పళ్లిచట్టంబి
04-02-2026
మలయాళ స్టార్ టొవినో థామస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘పళ్లిచట్టంబి’. ఈ సినిమాను వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రూపొందింది. దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ కథతో తెరకెక్కించారు. కయదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 9న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ఈ మూవీ మోషన్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది.