పాతబస్తీలో జంటహత్యల కలకలం
హైదరాబాద్: పాతబస్తీ(Old City Hyderabad) మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పురాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. అన్న ఆదిల్ ఖాన్ సొంత తమ్ముడు అఖిల్ ఖాన్, అడ్డొచ్చిన తమ్ముడి భార్య అజ్మీరాబేగంను పొడిచి చంపాడు. నాలుగు నెలలుగా అన్నదమ్ముల మధ్య డబ్బు విషయంలో గొడవ జరుగుతోంది. అన్న ఆదిల్ దగ్గర తమ్ముడు అఖిల్ ఖాన్ రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాడు.
తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదన్న కోపంతో ఆదిల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని, స్థానిక నివాసితులను ప్రశ్నించారు. వారు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






