21 April, 2026 | 12:47 PM

రైఫిల్‌తో కాల్చుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

21-04-2026 11:06 AM

ఝాన్సీ: ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని( Jhansi district) బబినా కంటోన్మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఆర్మీ జవాను, విధి నిర్వహణలో ఉండగానే తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడిని కోమల్ సింగ్‌గా గుర్తించారు. ఈయన గ్వాలియర్‌కు చెందినవారు. కాంటోన్మెంట్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌లో నాయక్ హోదాలో విధులు నిర్వర్తించేవారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని, విధి నిర్వహణలో ఉన్నప్పుడే అతను తన INSAS రైఫిల్‌తో తలలో కాల్చుకున్నాడని పోలీసులు తెలిపారు.