27 June, 2026 | 6:45 PM

ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సర్వసాధారణం : సీఐ శివశంకర్

27-06-2026 05:51 PM

నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లకు శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఐ శివశంకర్, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి వారి సేవలను అభినందించారు. బదిలీపై వెళ్ళిన కానిస్టేబుల్ లో మల్లేష్ మద్దూరు, రాము, కృష్ణ సృజన దామరగిద్ద పోలీస్ స్టేషన్ లకుబదిలీపై మల్లేష్ మద్దూర్ పోలీస్ స్టేషన్‌కు, వెళ్ళారు.

ఈసందర్భంగా సీఐ శివశంకర్ ,వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగం అనేది విధి నిర్వహణలో భాగంగా ఉంటుందని ఎక్కడకు వెళ్ళినా విధినిర్వహణలో నిజాయితీగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రాము, మల్లేష్ లు పేట పోలీస్ స్టేషన్ కు మంచి పేరు తెచ్చారని వారి సేవలను కొనియాడారు. దీంట్లో భాగంగానే వారిని పూలమాలలతో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎస్సై 2 గాయత్రి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.