మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే
27-06-2026 06:29 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి పట్టణ సమీపంలోని మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో 15 కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాన్వోకేషన్ డే(గ్రాడ్యుయేషన్ డే) కార్యక్రమంలో హాజరై వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీలకు మేడ్చల్ ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పట్టాలను అందజేశారు. అనంతరం విశిష్ట ప్రతిభ కనబరిచిన టాపర్ లకు గోల్డ్ మెడల్స్, ప్రశంస పత్రాలను ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో చామకూర కల్పన మల్లారెడ్డి, కళాశాల ఫ్రొఫెసర్ ఛాన్సలర్ శాలిని మహేందర్ రెడ్డి, ప్రినిపాల్ మాధవి లత, రిజిస్టర్, అధ్యాపకులు, విద్యార్థినిలు, తల్లితండ్రులు పాల్గొన్నారు.






