27 June, 2026 | 8:01 PM

జగన్నాధపురంలో వనమహోత్సవం

27-06-2026 06:42 PM

ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి: సర్పంచ్ వినోద్

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18వ తేదీన మొక్క నాటారని గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో మొక్కలు పెంచాలని పంచాయతీలో పూలు, పండ్లు, నీడ ఇచ్చే మొక్కలు ఉన్నాయని పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్టిలో ఉంచుకుని మొక్కలు శ్రద్ధగా పెంచాలన్నారు.