3 April, 2026 | 12:13 AM

Districts - Mahabubnagar

article_89847095.webp
రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి.. రూ.5 లక్షల బీమా పథకం

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ 5 లక్షల బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పాత పాలమూరులోని 10 వ డివిజన్ లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు.

02-04-2026

article_74843123.webp
పాపన్న ఆశయ సాధన కోసం కృషిచేద్దాం

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా మహబూబ్ నగరంలోని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాత్ర అత్యంత విశిష్టమైందని పేర్కొన్నారు. నాటి దొరల అరాచకాలు, మొగలాయుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని సామాన్య ప్రజల హక్కులను కాపాడిన గొప్ప యోధుడు ఆయన అని కొనియాడారు. పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతమన్నారు.

02-04-2026