2 July, 2026 | 8:25 PM

Districts - Mahabubnagar

article_81819315.webp
గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ : ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు నిర్మించిన ఘనత నిర్మిస్తున్న చరిత్ర పాలన ప్రభుత్వానికి సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎదిర డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల సాకారం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు మాటలకే పరిమితమై, పేదల కలలు కలగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఉత్తితి హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నిజం చేస్తోందని అన్నారు. నిర్మిస్తున్న ఇళ్లు కేవలం గోడల సముదాయం కాదని, అవి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు.

02-07-2026

article_65848478.webp
దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం

దేవరకద్ర : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం భవనాన్ని తెలంగాణ హైకోర్టు, మహబూబ్‌నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి న్యాయమూర్తి ఎన్.వి. శ్రావన్ కుమార్, హైదరాబాద్‌ నుండి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి తో కలిసి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.స్థానికంగా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం. ప్రేమలత, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసి న్యాయస్థానం భవనాని ప్రారంభించారు. కొత్త న్యాయస్థానం ప్రారంభం ద్వారా దేవరకద్ర మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని, కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు ప్రజలకు సమయపాలనతో కూడిన న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పి డి. జానకి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి(డి.ఎల్.ఎస్.ఎ) ఇందిర, ఇతర అధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

02-07-2026