27 June, 2026 | 7:41 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

27-06-2026 06:21 PM

– జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్

పాల్వంచ,(విజయక్రాంతి): జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో పల్స్ పోలియో, కార్యక్రమం పై కీలక సూచనలు చేశారు. జూన్ 28 నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 98, 818 మంది 0-5 సంవత్సరంలోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 925 బూత్ లు ,38 ట్రాన్సిట్ పాయింట్లు , 1001టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని  వంద శాతం  విజయవంతం చేయడం, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.