ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి పెద్ద పీట
మహబూబాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గత పాలకులు అప్పుల కుప్పగా మార్చారని, అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శాయంపేట మండలంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరుల కోసం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి శుభాకాంక్షలు తెలిపారు.




