అర్హులైన ప్రతిఒక్కరి పేరు జాబితాలో నమోదు కావాలి
బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
బంజారాహిల్స్, జూన్ 2౮ (విజయక్రాంతి): అర్హులైన ప్రతిఒక్క ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ లో భాగంగా బంజారాహిల్స్ డివిజనులోని ఉదయ్ నగర్ లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్థానికంగా జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు.
ప్రాంతం మారిన వారి వివరాలను సరి చేయాలని అధికారులను కోరారు. ఓటరు జాబితా అనేది ఎన్నికల ప్రక్రియకు పునాది వంటిదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ లక్ష్మి, బీఎల్ఏ జట్టు విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు నరేందర్, రాధా, శౌరిరాజ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






