2 September, 2026 | 9:35 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

సిద్దిపేట జిల్లాకు ‘సిరో ఫార్మా’

06-07-2026 | 02:35am
  1. కరకపట్ల బయోటెక్ పార్క్‌లో క్యాన్సర్ ఔషధాల ప్లాంటు
  2. నేడు ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): భారతదేశపు ఫార్మా క్యాపిటల్‌గా అగ్రస్థానంలో వెలుగులీనుతున్న తెలంగాణా రాష్ట్రం మరో భారీ ఔషధ పరిశ్రమకు వేదిక కానుంది. క్యాన్సర్ ఔషధాలు ఉత్పత్తి చేసే సిరో ఫార్మా సిద్దిపేట జిల్లా కరకపట్లలోని బయోటెక్ పార్క్-3లో నిర్మించిన అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారం సోమవారం ప్రారంభమవుతుంది.

ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సిరోప్లాంటును ప్రారంభిస్తారు. ఈ భారీ ప్లాం టులో పలు గ్లోబల్ ఔపధ ప్రమాణాల సంస్థల కొలమానాల ప్రకారం మందులు, సాఫ్ట్ జెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదరరాజనర్సింహ, పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటారు. ప్లాంటులో ప్రస్తుతం 275 మంది సిబ్బంది పనిచేస్తుండగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఉద్యోగులు, సైంటిస్టుల సంఖ్య రెట్టింపు అవుతుంది.