3 April, 2026 | 3:27 AM

Districts - Siddipet

article_36623376.webp
పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్

గజ్వేల్,ఏప్రిల్ 1: పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా, బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ గత కొంతకాలంగా పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను తగ్గించాయన్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగి, లాభాలు తగ్గి తాము అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయడం సాధ్యం కావడం లేదని చికెన్ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ యాజమాన్యాలు వ్యాపారుల శ్రమను దోచుకుంటూ, అన్యాయమైన నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.

01-04-2026