పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
18-04-2026 01:29 AM
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
చేగుంట ఏప్రిల్ 17: రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు మండల వ్యాప్తంగా నేడు భోజన విరామ సమయంలో , మండల కేంద్రాలలో , తహశీల్దార్లకు వినతిపత్రాలను ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచి. రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని . హెల్త్ కారడ్స్ తక్షణమే అమలు పరచి . సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.






