కన్నాల శివారులో క్షుద్రపూజల కలకలం
కల్షం చెంబు పోయిందని క్షుద్ర పూజలు చేస్తున్న ముఠా వెతుకుతుంటే వెలుగులోకి
భయాందోళనలో గ్రామ ప్రజలు
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల-పాత రచ్చపల్లి శివారులోని నిలగిరితోట లో క్షుద్ర పూజల(Occult worship) కళకళం రేపుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం కొత్త మంది వ్యక్తులు నాగపూజ పేరు తో గత 16 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఈ పూజలు 20 రోజులు చేస్తామని తెలుపుతున్నారని, ఈ పూజలో మహిళలు కూడ పాల్గొన్నారని తెలిపారు. ఈ పూజకు ఉపయోగించే కల్షం చెంబు పోయిందని క్షుద్ర పూజలు చేస్తున్న వారు శుక్రవారం రాత్రి తిరిగి వెతుకుతుండటంతో గ్రామస్తులకు విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళల్లో ఈ క్షుద్ర పూజలు చేస్తుండటంతో గ్రామ ప్రజలు భయందోనలు చెందుతున్నారు. పోలీస్ లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.




