20-02-2026 12:51:20 AM
మునుగోడు, ఫిబ్రవరి 19 : నియోజకవర్గ కేంద్రంలో వైన్ షాపుల సమయపాలనపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయ న, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 6:00 గంటల వరకు పర్మిట్ రూమ్లలో గానీ, షాప్ పరిసర ప్రాంతాల్లో గానీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవనానికి అనుమతి లేదని మరోమారు గట్టిగా హెచ్చరించారు.
సమయపాలనలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని తెలిపారు.వైన్ షాపుల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిర్వాహ కులకు సూచించారు.నియోజకవర్గంలో చట్టాలు, నియమాలు కఠినంగా అమలు కావాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.