మేడిపల్లి పీఆర్టీయూ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం
మేడిపల్లి,జులై 14 (విజయక్రాంతి): బో డుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి మం డల పి ఆర్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘ నూతన అధ్యక్షులుగా ఇ.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఎ. అనిల్ కుమార్ రెం డవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అందు బాటులో ఉంటామని తెలిపారు. ఈ ఎన్నిక జిల్లా అధ్యక్షులు వై. రామేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సిహెచ్. ఆనంద్ రెడ్డి సమక్షంలో జరిగింది.
మండల అసోసియేట్ అధ్యక్షులు గా సామ భూపాల్ రెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎన్. మాధవి, ఉపాధ్య క్షులు గా బాలరాజ్, అరుణ, కార్యదర్శులు గా జబ్బార్ ,లావణ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు విజయలక్ష్మీ, భాగ్యలక్ష్మి, జ్యోతి, మార్టిన్, శ్రీరామ్ ప్రసాద్, ఆల్వాల్ అధ్యక్షులు నర్సింహా, ప్రధాన కార్యదర్శి కైలాసపతి తదితరులు పాల్గొన్నారు.






