2 May, 2026 | 1:27 PM

శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

02-05-2026 12:35 PM

హైదరాబాద్: శంషాబాద్ వద్ద(Shamshabad Road Accident ) ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్ద  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. నిన్న శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఇద్దరు, వారి భార్యాపిల్లలు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మ‌ృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు 2 అంబులెన్సులను ఏర్పాటు చేశారు.