2 May, 2026 | 1:21 PM

ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి

02-05-2026 12:06 PM

ఫిర్యాదు చేసేందుకు వచ్చి... స్టేషన్ భవనంపై నుంచి దూకిన యువతి

బాల్కొండ పీఎస్ లో యువతి ఆత్మహత్యాయత్నం

ప్రియుడు మోసం చేశాడని మనస్థాపం

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్(Balkonda Police Station)లో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బాల్కొండకు చెందిన సాయికుమార్ తో యువతి ప్రేమలో ఉంది. సాయి అంతకుముందే తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టాడు. సాయికుమార్ పెళ్లి విషయం దాచిపెట్టి మోసం చేశాడని యువతి మనస్థాపం చెందింది. మోసం చేసిన సాయికుమార్ పై యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సాయికుమార్ పై ఫిర్యాదు చేసి.. స్టేషన్ భవనంపై కిందకి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.