14-02-2026 07:11:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం వలన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. తిరుమల మున్సిపాలిటీలో 24 కౌన్సిలర్ స్థానాలు గెలిపించి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన ప్రజలకు పార్టీ అందుబాటులో ఉంటూ ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు.