17 April, 2026 | 3:06 PM

శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు

17-04-2026 01:32 PM

వేములవాడ, ఏప్రిల్ 17,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో తెలంగాణ రాష్ట్ర రైల్వే,రోడ్డు భద్రత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) రమేష్ నాయుడు శుక్రవారం భక్తిశ్రద్ధలతో శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉండటం విశేషం.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజీపీకి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రం కప్పి,లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ఆర్‌ఐ సురేష్, ఎస్సైలు, ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్ తదితరులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.