అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
21-03-2026 04:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో మహేందర్ రెడ్డి ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటి కాలిపోయింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిమయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు, అప్పాల గణేష్ చక్రవర్తి సందర్శించి జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు వీరి వెంట స్థానిక కౌన్సిలర్లు కత్తి నరేందర్, sp రాజు, పెండం శ్రీనివాస్, గుంజాల చైతన్య, మాజీ కౌన్సిలర్లు తారక రఘు, తోట నర్సయ్య మరియు అడప శ్రీకాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.




