ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
21-04-2026 03:13 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని దన్నూర్ (బి) గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనుర్వి గ్రామ సర్పంచ్ రోహిణి తో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజుచోపిడే హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్య ప్రదర్శన చేసి అలరించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల శంకర్ మాట్లాడుతూ... విద్యార్థులు చక్కగా చదివి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఎదగాలని కోరారు.






