2 July, 2026 | 6:28 PM

Districts - Adilabad

article_64058866.webp
దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం

బోథ్, జులై 2(విజయక్రాంతి): నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తపల్లి గ్రామానికి నూతనంగా నిర్మించిన బ్రిడ్జి నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ రాజేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా గ్రామస్తులు డబ్బులు వైద్యాలతో ఘనంగా స్వాగతించారు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా గ్రామం అభివృద్ధి చెందలేదని గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పంచాయతీరాజ్ డి ఈ రాజేశ్వర్ ఏ ఈ శేఖర్ లతోపాటు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు

02-07-2026

article_68536462.webp
ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

బోథ్ జూలై 2 (విజయ క్రాంతి): ప్రతి విద్యార్థి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. గురువారం బజారత్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పోషకాహారం తీసుకోవాలని కోరారు ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోవాలని అందుకే ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఇలాంటి డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు ఆరోగ్యం ఉంటుందని సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మంచిదన్నారు మానసికంగా శారీరకంగా బాగుంటే విద్యార్థులు చదువుల్లో ముందు ఉంటారన్నారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

02-07-2026

article_27169197.webp
మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి

బోథ్, జులై 2 విజయక్రాంతి): మాది రైతు ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తున్నారని బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. గురువారం బోత్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలకు హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేపట్టిన పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిందన్నారు సబ్సిడీపై స్ప్రింగ్ క్లాసు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఉద్యానవన శాఖ ద్వారా అవసరమైన వసతులను రైతులకు కల్పిస్తుందన్నారు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు .

02-07-2026

article_23475111.webp
ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

బోథ్, (విజయక్రాంతి): ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతున్న డిసిసి కార్యదర్శి లోలపు పోశెట్టి చౌహన్ హరి సింగ్ లు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతన్న ఆదుకోవాలని ఉద్దేశంతో రైతు భరోసనిధులు వేయడం జరుగుతుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులు జిల్లా రైతాంగానికి అండగా ఉన్నారు అన్నారు.

02-07-2026

article_20920152.webp
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దు: సీఐ

బోథ్, జూలై 2(విజయక్రాంతి): వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని బోత్ సిఐ గురుస్వామి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో వాహన వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో వాహనాలు నడిపేవారు తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు తాగి వాహనాలు నడిపితే కేసులు తప్పవని పేర్కొన్నారు గంజాయి సైబర్ నేరాల గురించి గ్రామస్తులకు వివరించారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు సమావేశంలో న్యాయవాది పంద్రం శంకర్ ఉపసర్పంచ్ ఆత్రం మోహన్ వార్డు సభ్యులు నీలాకాంతరావు అనిల్ కుమార్ దేవరావు షేక్ రాములు ఉన్నారు

02-07-2026