క్రీడలపై ఆసక్తి అందరికి ఉండాలి
ఉట్నూర్, మే 18 (విజయక్రాంతి): నేటి యువత క్రీడలు పరుగు పందాల పైన ఆసక్తి చూపాలి ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ మోహన్ సింగ్ రాథోడ్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన 2 కే రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతో ఉపయోగంగా ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
18-05-2026