మస్జీద్ అభివృద్ధికి నిధులు మంజూరు
చేగుంట, మే 21: చేగుంట మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న మస్జీద్ అభివృద్ధి కి దుబ్బాక కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి రూ.7లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ మేరకు తన నివాసంలో నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ముస్లిం సంఘం అధ్యక్షులు సయ్యద్ సల్మాన్ గోరి, సభ్యులకు గురువారం అందజేశారు. కోరగానే మస్జీద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన శ్రీనివాస్ రెడ్డి కి, మస్జీద్ అధ్యక్షులు సల్మాన్ గోరి, సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ మహిపాల్, కన్యారం సర్పంచ్ శంకర్,, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సతీష్, మోహన్, కొలుపుల స్వామి, వార్డ్ సభ్యులు మహేష్, నవీన్, మస్జీద్ కమిటీ ఉపాధ్యక్షులు తయ్యాబ్, సభ్యులు సాజీద్, అన్వర్, ఈనా, అజీమ్, అలీమ్, వాజీద్, తహెర్ తదితరులు పాల్గొన్నారు.






