నూతన తాసిల్దార్ ను శాలువాతో సన్మానించిన మాజీ జెడ్పిటిసి
28-04-2026 03:16 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల తాసిల్దారుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బిక్షపతిని మంగళవారం నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి రాష్ట్ర జడ్పిటిసిల పోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల నూతన తాసిల్దార్ బిక్షపతిని శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి పెండింగ్ పనిని పరిష్కరించి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య తదితరులు ఉన్నారు.






