11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్–బీజేపీ సయోధ్య

17-02-2026 06:13 PM

చైర్మన్ కాంగ్రెస్… వైస్‌ చైర్మన్ బీజేపీ

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విధంగా కాగజ్‌నగర్‌లో కొత్త రాజకీయ సమీకరణకు నాంది పడింది. సాధారణంగా పరస్పర విభిన్న సిద్ధాంతాలు కలిగిన జాతీయ పార్టీలు అయిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ స్థానిక రాజకీయ అవసరాల దృష్ట్యా పరస్పరం మద్దతు ఇచ్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అవసరమైన మెజార్టీ కోసం స్థానిక స్థాయిలో రాజకీయ లెక్కలు మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ రెండు పార్టీలు, ఇప్పుడు అధికార సమీకరణాల నేపథ్యంలో కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్ధాంతాల కంటే అధికారమే ప్రధానమనే ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, టీఆర్‌ఎస్‌కు 11, కాంగ్రెస్‌కు 9, బీజేపీకి 5, ఎంఐఎంకు 1, స్వతంత్రులకు 4 వార్డులు దక్కాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి 16 మంది సభ్యుల మెజార్టీ అవసరం కాగా, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్‌కు స్వతంత్రులు, ఎంఐఎం మద్దతు తెలిపినా వారి సంఖ్య 14కే పరిమితమైంది. బుధవారం పురపాలక కార్యాలయానికి సభ్యులు హాజరైనప్పటికీ కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు కుదిరి, చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు, వైస్‌ చైర్మన్ పదవి బీజేపీకి ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం.