రాంప్రసాద్పై ప్రభుత్వ అండతోనే హత్యాయత్నం
సీపీఎం నేతలు
తాండూరు, జూన్ 28:, (విజయక్రాంతి)వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో రాంప్రసాద్ ముదిరాజ్ అనే యువకుడిపై జరిగిన దాడి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల అండదండలతోనే హత్యా ప్రయ త్నం జరిగిందని జిల్లా సిపిఎం పార్టీ నాయకులు శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం ఆయన బాధితులు రాంప్రసాద్, బోయిని సంగమ్మలను కలిసి పరామర్శించారు. ఈ నెల 24న రాంప్రసాద్ను తాండూరులోని గెస్ట్ హౌస్కు తీసుకెళ్లి దాడి చేశారని,
ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బె దిరించినట్లు బాధితుడి తల్లి సంగమ్మ ప్రజా సంఘాల నాయకులకు తెలిపింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాధిత కుటుంబానికి సిపి ఎం, ప్రజా సంఘాల నాయకులు అండగా ఉంటారని అధైర్య పడ కూడదని అన్నారు. రాంప్రసాద్ పై కర్రలతో దాడులు చేసిన మహేందర్, రవి అనే వ్యక్తుల లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.






