సన్రైజర్స్లోకి అంబరీష్
శివమ్ మావి స్థానంలో చోటు
ముంబై, మే 1: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న సన్రైజర్స్ జట్టులోకి మరో యువ పేసర్ ఎంట్రీ ఇచ్చాడు. గాయపడ్డ శివమ్ మావి స్థానంలో 18 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆర్ఎస్ అంబరీష్కు చోటు దక్కింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో శివమ్ మావిని 75 లక్షలకు సన్రైజర్స్ తీసుకుంది.
అయితే అత ను గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. దీంతో ఆర్ఎస్ అం బరీష్తో అతని స్థానాన్ని భర్తీ చేసింది. కుడిచేతి మీడియం పేసర్, ఎడమచేతి బ్యాటర్ అయిన అంబరీష్ 2026 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్లో 11 వికెట్లతో అతను భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.
ఈ తమిళనాడు క్రికెటర్ గత కొంతకాలంగా యూత్ క్రికెట్లో తనదైన పేస్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. అంబరీష్కు ఫైనల్ ఎలెవెన్లో చోటు దక్కినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఈ సారి యువ పేసర్లకు అవకాశాలిస్తోంది. దానికి తగ్గట్టే ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుస్సేన్ అదరగొడుతున్నారు. ఇప్పుడు అంబరీష్ కూడా వీరికి జత కలిసే అవకాశముంది. సన్రైజర్స్ తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఇప్పటికే సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్లలోనూ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్ను కూడా ఓడించి జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఆరింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.






