16 May, 2026 | 8:41 AM

గృహిణికి సైబర్ మోసం

21-02-2026 01:37 AM

జలమండలి అధికారులమని  95 వేలు కాజేసిన కేటుగాళ్లు

మేడిపల్లి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): వాటర్ బోర్డు అధికారి అని ఫోన్ చేసిన సై బర్ నేరగాళ్లు ఓ గృహిణి ఖాతా నుంచి రూ. 95 వేలు కాజేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడకు చెందిన ఉమ(33)కు హెచ్‌ఎం డబ్ల్యు ఎస్‌ఎస్‌బి అధికారినని, మీటర్ రీడింగ్ అప్డేట్ కాలేదని, ’మీటర్ అప్డేట్ చేసుకోవాలని ఏపీ కే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు.

వారు చెప్పినట్టే ఉమ చేయడంతో ఫోన్‌ను సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి తెచ్చుకుని, ఆమె ఖాతా నుంచి రూ.95 వేలను  బదిలీ చేసుకున్నారు. ఈ విషయంపై ఉమ మేడిపల్లి పోలీసులకు  ఫిర్యాదు చేసింది.