calender_icon.png 21 February, 2026 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటల్‌లో పేలిన ఇడ్లీ స్టీమర్

21-02-2026 01:36:20 AM

  1. నలుగురు కార్మికులకు గాయాలు

ఎల్బీనగర్‌లోని ‘చట్నీస్’లో ఘటన

ఎల్బీనగర్, ఫిబ్రవరి 20: హోటల్‌లో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలిన ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం ఎల్బీనగర్‌లోని చట్నీస్ హోటల్‌లో చోటు చేసుకుంది. చట్నీస్ హోటల్‌లో మధ్యాహ్న ప్రాంతంలో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలింది.

ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి హోటల్ లో ఉన్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు కార్మికులకు కాలిన గాయాలు కాగా, ఒక కార్మికుడికి ఇనుప ప్లేట్ తాకడంతో తలకు తీవ్రంగా గాయప డ్డాడు. పోలీసులు వారిని ఎన్టీఆర్ నగర్లోని ఆద్య ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన జోగేశ్వర్(20), దయా(23), సుమిత్(21), సునీల్ (21) ఉన్నారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.