ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం
15-08-2026 03:58 PM
బోథ్. ఆగస్ట్ 15 ( విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాల పటేండ్లు ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని న్యాయవాది పంద్రం శంకర్ కోరారు. ఆగస్టు 9న జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయ వంతం చేసేందుకు సహకరించిన గ్రామాల పటేళ్లను ఆయా గ్రామాల రాయి సెంటర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా ఉండి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఇదే విధమైన సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో పాట్నాపూర్ సార్మెడి భీమ్రావు రిటైర్డ్ ఉద్యోగులు మందడి నాగరావ్ పెందూరు సోనేరావు వెంకట్రావు సర్పంచ్లు విశ్వేశ్వరరావు పెందుర్తి పృథ్వి మెస్రం కృష్ణ మాజీ సర్పంచ్ గోపాల్ మండాడి రాము కడప రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.






