సిరికొండ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం
13-07-2026 03:42 PM
ప్రారంభించిన గ్రామ సర్పంచ్ పంచిత ధర్మరాజు
ధర్మపురి,జూలై13 (విజయక్రాంతి): బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టినా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం సిరికొండ గ్రామ సర్పంచ్ పంచిత ధర్మరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోవాలని కూలీలకు,అధికారులకు, వార్డు సభ్యులకు సర్పంచ్ ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, ఇంజనీర్ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ అమరనాథ్ మరియు కూలీలు పాల్గొన్నారు.






