13 July, 2026 | 5:32 PM

Breaking News

కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •  

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

13-07-2026 04:28 PM

ముకరంపుర, జూలై 13(విజయ క్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని(National Deworming Day) పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని సుభాష్‌ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తో కలిసి  మేయర్ కొలగాని శ్రీనివాస్  విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారే పేగు సంబంధిత నులిపురుగుల నివారణే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే బలమైన దేశ నిర్మాణానికి పునాది అని  అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శ్రీరామ్, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు.