13 July, 2026 | 5:47 PM

Breaking News

గుడుంబా తయారీకి బెల్లం తరలింపు.. 7 టన్నులు పట్టివేత   •   పిట్టంపల్లి గ్రామంలో పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి   •   పాఠశాల ఆవరణలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయాలి   •   ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ   •   ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు   •   జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ   •   కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •  

భూ సర్వేలు వేగవంతం చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

13-07-2026 04:36 PM

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలో భూ సర్వే దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ లైసెన్సుడ్ సర్వేయర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సర్వేయర్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు.

ప్రతి మండలంలో భూ సర్వేలను పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్సుడ్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 (రూ.50 పారితోషికం, రూ.10 రవాణా భత్యం) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సర్వేల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రికార్డులు, సరిహద్దులు క్షుణ్ణంగా పరిశీలించి భూ వివాదాలకు తావులేకుండా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా సర్వేయర్ గిరిధర్, రెవెన్యూ అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు.