ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
కోనరావుపేట జులై 13 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు.విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమాదేవి, అంగన్వాడీ టీచర్ బైరగొని మాధవి, ఆశా వర్కర్ తిక్కల బాబాయి, ఉమాతో కలిసి ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు.అనంతరం ఈ మాత్రల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమయానికి మందులు తీసుకోవడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పిల్లల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






