13 May, 2026 | 12:52 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

ఐకమత్యం చాటేందుకే ఏక్తా దివాస్

31-10-2025 05:03 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కుల, మత వర్గ, లింగ విభేదాలు లేకుండా ప్రజల్లో ఐకమత్యాన్ని చాటేందుకే ఏక్తా దివాస్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు మండలంలోని వివిధ శాఖల అధికారులు అన్నారు. మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో స్థానిక పోలీసుల శాఖ ఆధ్వర్యంలో టూ కే రన్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ... నేటి యువత సర్దార్ పటేల్ చూపిన బాటలో నడిచి దేశ ఐక్యతకు, అభివృద్ధికి, భద్రతకు పాటుపడాలని అన్నారు.