వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయం
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని 19వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు. కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పలు రకాల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరబాబు, ముండ్ర రామారావు, ధరావత్ హాజీనాయక్, పోటు రంగారావు, విద్యాసాగర్ రావు, యాదగిరి రావు, ఖాదర్, మౌలానా, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
02-04-2026