7 April, 2026 | 9:32 AM

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

15-10-2025 01:07 PM

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా(Kamareddy) బిక్కునూరు మండలం వజంగంపల్లిలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.