హైదరాబాద్లో కలకలం.. ముగ్గురు బాలికలు అదృశ్యం
హైదరాబాద్: నగరంలో అక్కాచెల్లెళ్లతో మిస్సింగ్(Girls Missing) కలకలం రేపుతోంది. హిమాయత్నగర్లోని తమ ఇంటి నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు బాలికలు స్నేహ, లలిత, లత సోమవారం అదృశ్యమయ్యారు. ఆ ఇద్దరు సోదరీమణులు, తమ బంధువు కూడా అయిన ఒక స్నేహితురాలితో కలిసి ఉదయం వేళ ఇంటి నుండి బయలుదేరారు. వారు చివరిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) సమీపంలో కనిపించినట్లు పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ ముగ్గురు బాలికలను ఛత్తీస్గఢ్కు నుంచి వచ్చిన వలస కుటుంబాలకు చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ యువతుల ఆచూకీ కనుగొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ బాలికల ఆచూకీ కనుగొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్లెస్ సందేశం పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.






