జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలి
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
బోధన్, జూలై 5 (విజయక్రాంతి): బోధన్ డివిజన్ కేంద్రంలోని పిఆర్ టి యు భవనంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎఐఎస్ ఎప్ జిల్లా కార్యదర్శి బోడ. అనిల్, పిడిఎఫ్ యు జిల్లా అధ్యక్షులు ఆర్. గౌతమ్ కుమార్ లు మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ ఎప్ బోధన్ డివిజన్ ఇంచార్జ్ విశాల్ దేవ్, పిడిఎఫ్ యు జిల్లా కార్యదర్శి అనిల్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు విశాల్, ఎఐఎప్ డి ఎస్ జిల్లా కన్వీనర్ మోసిన్, పిడిఎఫ్ యు, కే..సాయినాథ్, ఇతర సంఘాల నాయకులు జి.కిషోర్, శంకర్ సతీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు






