calender_icon.png 9 February, 2026 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు ప్రజల చేతుల్లో వజ్రాయుధం

09-02-2026 12:00:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ప్రజా ఆయుధం అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా స్థానిక కే.ఆర్.కే కాలనీలో భారీ ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు.అవగాహన ర్యాలీనీ ఆర్డీఓ స్రవంతి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులందరితో ఓటు హక్కు వినియోగంపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, డివైఎస్‌ఓ శ్రీనివాస్, డీపీఆర్‌ఓ విష్ణువర్ధన్, మెప్మా పిడి రాజు తహసిల్దార్లు శ్రీనివాస్, గోవింద్, వేణుగోపాల్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.